Next Story
Newszop

Isha Arora: ఎవరీ ఇషా అరోరా.. సోషల్మీడియాలో ఓవర్నైట్ స్టార్ అయిన పోలింగ్ ఏజెంట్!

Send Push
Isha Arora: ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. మ్యాచ్ జరుగుతున్నపుడు.. స్టేడియంలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉండే అందమైన అమ్మాయిలను వీడియోగ్రాఫర్ తమ కెమెరాల్లో బంధిస్తారు. ఇక ఆ లైవ్‌ను కోట్ల మంది వీక్షించగా.. అందులో అందంగా కనిపించిన అమ్మాయి.. ఎవరా అంటూ సోషల్ మీడియాలో తెగ వెతికేస్తూ ఉంటారు. వారి సోషల్ మీడియా ఐడీలు కనిపెట్టి.. వారి ఫోటోలను వైరల్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా.. ఓ పోలింగ్ ఏజెంట్ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇషా అరోరా అనే పోలింగ్ ఏజెంట్.. శుక్రవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో ఎన్నికల విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అంతే.. ఇక నెటిజన్స్ ఆమె కోసం ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తున్నారు. ఆమె వివరాలు తెలుసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో ఇషా అరోరా అనే పోలింగ్‌ ఏజెంట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షించారు. దీంతో ఆమె ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో బాగా వైరల్‌ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహరణ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని గంగోహ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లో ఇషా అరోరా పోలింగ్ ఏజెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఓటింగ్‌కు ముందు ఇషా అరోరా ఈవీఎం బాక్సులు తీసుకుని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతరం శుక్రవారం పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఆమె మీడియాతో మాట్లాడిన వీడియో కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆమె ఎవరు అని నెటిజన్లు తెగ వెతికేయగా.. ఇషా అరోరా వివరాలు బయటికి వచ్చాయి. ఇషా అరోరా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నారు. గతంలో కూడా ఆమె రెండుసార్లు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. విధుల్లో ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి అని ఆమె సూచించారు. అవి ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలమని.. అవి పాటించడం వల్లే ఎన్నికల విధుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని ఇషా అరోరా వెల్లడించారు.ఇక 2019 ఎన్నికల వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లోనే మరో మహిళ కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. పసుపు రంగు చీరలో.. నల్ల కళ్లద్దాలతో.. ఎన్నికల విధులకు వెళ్తున్న రీనా ద్వివేది ఓవర్‌నైట్‌లో అప్పుడు సోషల్‌ మీడియాలో స్టార్‌ అయ్యారు. ఆ తర్వాత 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రీనా ద్వివేది ఫోటోలు నెట్‌లో వైరల్ అయ్యాయి. ఫ్యాషన్‌ అంటే ఇష్టం ఉన్న రీనా ద్వివేది.. లక్నోలోని పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.
Loving Newspoint? Download the app now